రూ.20 కోట్లు!....... 8 నిమిషాల్లో:
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్బాబు నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘స్పైడర్’. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రకుల్ప్రీత్ సింగ్ కథానాయిక. దర్శకుడు ఎస్జే సూర్య విలన్గా నటిస్తున్నారు. ఇటీవలే మహేశ్బాబు, ఎస్జే సూర్యల మధ్య జరిగే పోరాట సన్నివేశాలను తెరకెక్కించారు దర్శకుడు. ఎనిమిది నిమిషాల పాటు సాగే వీరిద్దరి సన్నివేశమే సినిమాలో హైలెట్గా ఉంటుందని కోలీవుడ్ సమాచారం. అంతేకాకుండా సినిమాలో ఇదే అతిపెద్ద ట్విస్ట్ అని చెబుతున్నారు. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సన్నివేశం చిత్రీకరణకు ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు పెట్టారట మురుగదాస్. అంతేకాకుండా ఈ సన్నివేశానికి గ్రాఫిక్ సొబగులు అద్దనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తమిళంలోనూ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే మహేశ్బాబుకు తమిళంలో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. తొలిసారిగా ఆయన నేరు చిత్రంలో అందులోనూ తమిళ దర్శకుడి సినిమాతో రావడంతో అప్పుడే వాణిజ్య కార్యక్రమాలు మొదలైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా ‘కత్తి’, ‘తుపాక్కి’ వంటి మాస్ హిట్లు అందిచ్చిన మురుగదాస్ తదుపరి సినిమా కావడంతో ఆయన అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.